News July 2, 2024
అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అద్దంకి పట్టణంలో వైయస్సార్ అపార్ట్మెంట్ దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 10, 2025
ప్రకాశం వాసులకు CM గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లాకు సంబంధించి CM కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఉద్యానవన పంటలు సాగుచేసే రైతన్నలకు శుభవార్తగా చెప్పవచ్చు. ఉద్యానపంటలపై సమీక్షించిన సీఎం, జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులను పూర్తి చేయడం ద్వారా పంటలకు నీరు అందించవచ్చని అధికారులకు సూచించారు. పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొత్తగా 7లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు.
News December 10, 2025
చీమకుర్తిలో పిల్లలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

చీమకుర్తిలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ రాజాబాబు, MLA విజయ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓలు శివాజీ, ఎల్వీ నరసింహారావు, మండల టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
News December 10, 2025
ప్రకాశం జిల్లాలో 2కు చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య రెండుకు చేరింది. వారం రోజుల వ్యవధిలో స్క్రబ్ టైఫస్తో ఇద్దరు మహిళలు మృతి చెందారు. గతంలో ఇదే వ్యాధి లక్షణాలతో ఎర్రగొండపాలెం మండలంలో ఓ మహిళ మృతి చెందగా.. తాజాగా సంతనూతలపాడు మండలం రుద్రవరానికి చెందిన మహిళ మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. అయితే స్క్రబ్ టైఫస్ గురించి ఆందోళన అవసరం లేదని.. అవగాహన అవసరమని అధికారులు సూచిస్తున్నారు.


