News August 8, 2024

అద్దంకి వద్ద రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

అద్దంకి పట్టణంలో గరటయ్యకాలనీ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి రేణంగివరం వైపు నుంచి అద్దంకి వస్తున్న RTC బస్సును, మార్టూరు నుంచి అద్దంకి వస్తున్న బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న బాలుడు మణికంఠ మృతి చెందగా తండ్రి రాఘవకి గాయాలయ్యాయి. వీరు మార్టూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Similar News

News April 11, 2026

ప్రకాశం: ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

ఒంగోలులో ఒపెన్ ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధమైంది. స్థానిక D.R.R.M మున్సిపల్ హైస్కూల్‌లో ఈనెల 11 నుంచి 15 వరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్లు DEO, క్యాంప్ ఆఫీసర్ P.V రేణుక తెలిపారు. అయితే త్వరలో వెలువడనున్న ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News April 11, 2026

ప్రకాశం: పెన్షన్ ఫ్రాడ్‌లపై SP హెచ్చరిక

image

పెన్షన్ ఫ్రాడ్‌లపై అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని.. బ్యాంకు అధికారులమని చెప్పి ఓటీపీలు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అడిగి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎవరూ వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

News April 11, 2026

ప్రకాశం: పెన్షన్ ఫ్రాడ్‌లపై SP హెచ్చరిక

image

పెన్షన్ ఫ్రాడ్‌లపై అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని.. బ్యాంకు అధికారులమని చెప్పి ఓటీపీలు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అడిగి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎవరూ వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.