News February 16, 2025
అద్దంకి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

పల్నాడు జిల్లా రాజుపాలెం(M) నెమలిపురి దగ్గర అద్దంకి- నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళుతున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీమా, నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 21, 2025
HYD: దొంగ నల్లా కనెక్షన్పై ఫిర్యాదు చేయండి

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నల్లా అక్రమ కనెక్షన్లపై అధికారుల రైడ్ కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో దాదాపుగా 50 మందికిపైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకున్న వారు, కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే 99899 98100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
News November 21, 2025
ఖమ్మం: అనుమానంతో భార్యను కడతేర్చిన వైనం

ఖమ్మం గట్టయ్య సెంటర్లో తన భార్య సాయి వాణి(33)ని భర్త గోగుల భాస్కర్ కత్తితో గొంతు కోసి చంపడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే కొన్నేళ్లుగా అనుమానంతో వేధిస్తున్న భాస్కర్కు గతంలో పోలీస్ స్టేషన్లలో కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఏడాదిగా విడిగా ఉంటున్న భార్యను మాటువేసి హతమార్చాడు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిది APలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట.
News November 21, 2025
కడపలో నేడు వాహనాల వేలం

కడప జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు వాహనాలు పట్టుబడ్డాయి. ఈక్రమంలో 9 వాహనాలకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. కడపలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని అధికారులు కోరారు.


