News March 5, 2025
అధికారులకు ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఆదేశాలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేసవిలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ అన్నారు. అమలాపురం భట్లపాలెం ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సీజన్లో ఎక్కడ లోఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో కొత్తగా ఆరు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News December 4, 2025
సిద్దిపేట: ల్యాబ్ టెక్నీషియన్లతో డీఎంహెచ్ఓ సమావేశం

సిద్దిపేట జిల్లాలో జిల్లా వైద్యాధికారి సీహెచ్ ధన్ రాజ్ ఆధ్వర్యంలో జిల్లాలోని లాబ్ టెక్నిషియన్స్ నెలవారి సమీక్ష సమావేశం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి PHC, CHC, జిల్లా HOSPITALలలో పేషంట్స్కి నిర్వహించే పరీక్షలలో ఎలాంటి అలసత్వాన్ని లేకుండా నిర్వహించాలని, సకాలంలో రిపోర్ట్స్ అందించాలని ఆదేశించారు.
News December 4, 2025
ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: కందుల

ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. గురువారం రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాజమండ్రి నగరం పర్యాటకం, సంస్కృతి & వినోద రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
News December 4, 2025
HYD: త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తిమంతం: రంగారావు

త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తివంతమైందని, దేశ రక్షణలో కీలకమని నేవీ విశ్రాంత ఆఫీసర్ DP రంగారావు అన్నారు. ‘1969-80 వరకు పని చేశాను. 1971 WARలో ఉన్నాను. 1970-76లో ఒకే షిప్లో 6 ఏళ్లు 28 దేశాలు ప్రయాణించాను. 1976లో INS వీరబాహు సబ్ మెరైన్ బేస్ మెయింటెనెన్స్ మెరైన్ ఇంజినీర్గా విధులు నిర్వహించాను. సంగ్రామ్ మెడల్, పశ్చిమ స్టార్ మెడల్స్ అందుకున్నాను’ అని నేవీ డే వేళ హయత్నగర్లో ఆయన Way2Newsతో మాట్లాడారు.


