News February 4, 2025

అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న అర్జీలు, రీ ఓపెన్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రీ ఓపెనింగ్ ఫిర్యాదులపై జేసీ సూరజ్, డీఆర్ఓ మురళిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో40 రీ ఓపెనింగ్ అర్జీలను వ్యక్తిగతంగా పరిశీలించారు. జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 16, 2026

కరీంనగర్‌కు కనుమ శోభ.. మూగజీవాలకు మొక్కులు

image

సంక్రాంతి సంబరాల్లో భాగంగా చివరి రోజైన కనుమ పర్వదినాన్ని రైతులు ‘పశువుల పండుగ’గా జరుపుకుంటారు. ఈ క్రమంలో నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు ఉదయాన్నే ఎద్దులు, ఆవులకు స్నానాలు చేయించారు. అనంతరం కొత్త పగ్గాలు, మెడలో మువ్వల పట్టీలు కట్టి, కొమ్ములకు రంగులు అద్ది అందంగా ముస్తాబు చేసి పూజలు నిర్వహించారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనుల్లో తమకు తోడుగా నిలిచే పశువులకు రైతులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

News January 16, 2026

బాపట్ల: వెలుగులోకొచ్చిన 500ఏళ్ల గణపయ్య విగ్రహం!

image

అద్దంకి మండలం కొత్త రెడ్డిపాలెంలో పురాతన ఉండ్రాళ్ల గణపతి విగ్రహం గురువారం వెలుగులోకి వచ్చింది. కొత్త రెడ్డిపాలెం-చిన్న కొత్తపల్లి గ్రామాల మధ్య ఓ రైతు పొలంలో ఈ విగ్రహం బయటపడింది. పురావస్తు పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి విగ్రహాన్ని పరిశీలించి 500 ఏళ్ల నాటి విగ్రహంగా ఆయన పేర్కొన్నారు. ఉండ్రాళ్ల గణపతి విగ్రహానికి గ్రామస్థులు పూజలు చేశారు

News January 16, 2026

కామారెడ్డి జిల్లాలో కొండెక్కిన ధరలు

image

కామారెడ్డి జిల్లాలో మాంసం ధరలు భగ్గుమంటున్నాయి. సంక్రాంతి ముగింపు వేడుక ‘కనుమ’ సందర్భంగా శుక్రవారం చికెన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. కిలో చికెన్ రూ.300 నుంచి రూ.330 వరకు పలుకుతుండగా, లైవ్ కోడి ధర రూ.210 దాటింది. మటన్ కిలో రూ.800కు చేరింది. పండుగ రద్దీతో పాటు కోళ్ల మేత ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్యులకు మాంసం ప్రియమవడంతో బెంబేలెత్తుతున్నారు.