News March 13, 2025
అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతినెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ఈనెల 15 నిర్వహించనున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని ముందు రోజు రాత్రి ఆయా మండలాలకు వెళ్లి రాత్రి బస చేయాలన్నారు.
Similar News
News February 14, 2026
నిజాయతీకి నిలువుటద్దం!

నేడు దామోదరం సంజీవయ్య 105వ జయంతి. కర్నూలు జిల్లా పెద్దపాడులో జన్మించిన ఆయన అతి పిన్న వయసులో (38 ఏళ్లు) ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. తొలి దళిత సీఎంగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయన సేవలు చిరస్మరణీయం. ఏసీబీ వ్యవస్థ స్థాపన, భూ పంపిణీ వంటి విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి అందరికీ అజాతశత్రువుగా పేరొందారు. పదవులు అనుభవించినా సొంత ఇల్లు కూడా లేని ఆయన నిరాడంబరత నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
News February 14, 2026
ఆ బౌలర్తో జాగ్రత్త.. భారత బ్యాటర్లకు మాజీల సూచన

రేపు పాక్తో మ్యాచులో సైడ్ ఆర్మ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలుగా మారే అవకాశముంది. ఆయన బౌలింగ్లో జాగ్రత్తగా ఆడాలని టీమ్ఇండియాకు హర్భజన్ సింగ్ సూచించారు. ఈ మ్యాచులో INDదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తారిఖ్ బాల్ను ఆగి వేస్తుండడంతో విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. అతడు అలా ఆగినప్పుడు భారత బ్యాటర్లు పక్కకు తప్పుకోవచ్చని స్పిన్నర్ అశ్విన్ సలహా ఇచ్చారు.
News February 14, 2026
RR: ఇద్దరికి సున్నా.. వారి ఓటెవరికి వేసినట్లు?

RR మున్సిపల్ ఫలితాల్లో ఆసక్తికర ఘటనలు. చేవెళ్ల 5th వార్డులో TRP అభ్యర్థి రాజుకు ఒక్క ఓటూ పడలేదు. తన ఓటు తానూ వేసుకోకపోవడం గమనార్హం. 1st వార్డులో BJP అభ్యర్థి శ్రీనివాస్కు 2ఓట్లు రాగా 4వవార్డు BJP అభ్యర్థి కేశపల్లి భాగ్యమ్మకు 2ఓట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలో 2nd వార్డ్లో అలీకి ఓట్లురాలేదు. 19thవార్డులో BSP అభ్యర్థి రఘుపతికి 1ఓటు పడింది. శంకర్పల్లిలో 13వవార్డు జనసేన అభ్యర్థి సాయికి 2ఓట్లు పడ్డాయి.


