News February 3, 2025

అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న అర్జీలు, రీ ఓపెన్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రీ ఓపెనింగ్ ఫిర్యాదులపై జేసీ సూరజ్, డీఆర్ఓ మురళిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో40 రీ ఓపెనింగ్ అర్జీలను వ్యక్తిగతంగా పరిశీలించారు. జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 19, 2025

ఆపదలో ఉంటే చెప్పండి: అన్నమయ్య SP

image

ఆపదలో ఉన్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112కు డయల్ చేయాలని సూచించారు. పోలీసులకు సమస్యపై ఫిర్యాదు చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ వివరాలను అందించడానికి ప్రయత్నించాలన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

News February 19, 2025

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

image

స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 132 పాయింట్లు తగ్గి 75,835 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు తగ్గి 22,890 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీ టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతుండగా HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.

News February 19, 2025

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ 

image

వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి ఇతర ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగు, తాగునీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన, రైతు భరోసా, యూరియా కొరతపై కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!