News March 28, 2025

అధికారులకు బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలు

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపాలని అధికారులకు సూచించారు. దొంగతనాలు, నేరాలు జరగకుండా రాత్రి వేళలో పటిష్టమైన గస్తీ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 20, 2025

అమలాపురం: కిడ్నాప్ కథలో ట్విస్ట్.. చివరికి అరెస్ట్..!

image

అమలాపురంలో కలకలం రేపిన పదేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడు మట్టపర్తి దుర్గా నాగసత్యమూర్తికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బాలికకు వరుసకు మామయ్య అయిన సత్యమూర్తి ఈ నెల 10న పాపను బైక్‌పై తీసుకెళ్లి, యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు డిమాండ్ చేశాడని సీఐ వీరబాబు తెలిపారు. బాలిక తండ్రి కముజు వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు.

News November 20, 2025

ఆవులతో డెయిరీఫామ్ ఎందుకు మేలంటే?

image

హోలిస్టిన్ ఫ్రీజియన్ జాతి ఆవులు ఒక ఈతకు 3000 నుంచి 3500 లీటర్ల పాలను ఇస్తాయి. వీటి పాలలో వెన్నశాతం 3.5-4% ఉంటుంది. జెర్సీ జాతి ఆవు ఒక ఈతకు 2500 లీటర్ల పాలనిస్తుంది. పాలలో వెన్నశాతం 4-5% ఉంటుంది. ఒక ఆవు ఏడాదికి ఒక దూడను ఇస్తూ.. మనం సరైన దాణా, జాగ్రత్తలు తీసుకుంటే 10 నెలలు కచ్చితంగా పాలిస్తుంది. ఒక ఆవు రోజుకు కనీసం 12-13 లీటర్లు పాలిస్తుంది కనుక పాడి రైతుకు ఏడాదిలో ఎక్కువ కాలం ఆదాయం వస్తుంది.

News November 20, 2025

పరకామణి కేసుపై తర్జనభర్జన..?

image

హైకోర్టు ఆదేశాలతో తిరుమల శ్రీవారి పరకామణి కేసు విచారణను CID బృందం వేగవంతం చేసింది. పరకామణి చోరీపై మరోసారి తిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని TTD బోర్డు నిర్ణయించింది. హైకోర్టు పరిశీలనలో ఉన్న కేసుపై మరోసారి కేసు ఎలా నమోదు చేయాలని పోలీసుల తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. కేసును పోలీసులకు ఇవ్వాలా? లేదా హైకోర్టుకు నివేదించాలా? లేదా CIDకే మరోసారి ఫిర్యాదు చేయాలా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.