News December 10, 2024
అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం

వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలును వేగవంతం చేసి, ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో రైతులకు లబ్ధి చేకూర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఎకరాలలో పామాయిల్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News October 19, 2025
CM సాబ్.. తోడా హాత్ మిలావోనా!

సదర్ సమ్మేళన్లో CM రేవంత్ రెడ్డి యువతలో జోష్ నింపారు. ఓ వైపు యాదవుల బలగం, మరోవైపు దున్నరాజుల విన్యాసాలు వీక్షించేందుకు NTR స్టేడియానికి వేలాది సంఖ్యలో యువకులు తరలివచ్చారు. అంతటి రద్దీలోనూ CMను చూసిన కొందరు ఆయన్ను చరవాణిలో బంధించేందుకు, చేయి కలిపేందుకు ఆసక్తి చూపించారు. వేదిక అలంకరించబోయే ముందు యువతను చూసిన CM స్వయంగా వారి వద్దకు వెళ్లారు. సెక్యూరిటీని పక్కనబెట్టి సింప్లిసిటీని చాటారు.
News October 19, 2025
లేగదూడను చూసి CM మురిసే!

యాదవుల సదర్ అంటే CM రేవంత్ రెడ్డికి మక్కువ అని చెప్పడానికి ఈ ఫొటో చక్కటి ఉదాహరణ. NTR స్టేడియం వద్ద నిర్వహించిన సదర్లో రేవంత్ ఏ ఒక్కరినీ నిరాశ పర్చలేదు. కళాకారుల నుంచి యువత వరకు అందరినీ పలకరించారు. యాదవ సోదరులతో ఫొటోలు దిగి సంభాషించారు. వేదిక ఎక్కిన తర్వాత అందంగా అలంకరించిన ఓ లేగదూడను చూసి ఆయన ముగ్ధుడయ్యారు. ఆ దూడెను తన దగ్గరకు తీసుకోవడం సదర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
News October 19, 2025
CM రాక.. బోనంతో స్వాగతం

ఎన్టీఆర్ స్టేడియం వద్ద శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆదివారం వైభవంగా సాగింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకలో CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోయర్ ట్యాంక్బండ్ నుంచి ధర్నాచౌక్ ప్రాంగణానికి చేరుకున్న ఆయన కాన్వాయ్ డోర్ ఓపెన్ చేసి మహిళా కళాకారులకు అభివాదం చేశారు. నెత్తిన బోనం ఎత్తుకొని నృత్యాలు చేస్తున్న కళాకారుల్లో CMని చూసి ఉత్సాహం మరింత పెరిగింది.