News March 15, 2025
అధికారులతో సమావేశం నిర్వహించిన మేయర్, కమిషనర్

బడ్జెట్ సమీక్షపై అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సమావేశం నిర్వహించారు. 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బల్దియా బడ్జెట్ రూపకల్పనపై సమర్పించిన అంచనాలు సమీక్షించి అధికారులకు మేయర్, కమిషనర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Similar News
News March 17, 2026
జీవీఎంసీలో ప్రత్యేక పాలన అమలు(1/2)

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో ఎన్నికైన మేయర్తో పాటు కార్పొరేటర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలన అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికైన ప్రతినిధుల పదవీకాలం ముగియడంతో కార్పొరేటర్ల అధికారాలు కూడా ముగిశాయి.
News March 17, 2026
అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు!

TG: గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలు అందించే బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి ఆమోదం లభించేలా చేసి, మేడే లోపు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 3-4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. HYDలో వెల్ఫేర్ బోర్డు, వారిని వ్యవస్థీకృత పరిధిలోకి తెచ్చేందుకు ప్రత్యేక సైట్, యాప్ను సర్కార్ సిద్ధం చేస్తోంది.
News March 17, 2026
ఈ నెల 27న భద్రాచలానికి సీఎం రేవంత్

భద్రాచలంలో ఈ నెల 27న జరిగే శ్రీరామనవమి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం కలెక్టర్తో సమీక్షించారు. రూ. 300 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయగా, తొలి విడతలో రూ. 100 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు. దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాద్రిని అన్ని విధాలా సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.


