News September 4, 2024
అధికారులతో సమావేశమైన ఒంగోలు MLA

ఒంగోలు నగరంలోని TDP కార్యాలయంలో ఒంగోలు MLA దామచర్ల జనార్దన్ రావు నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డీఎంహెచ్వోల వంటి పలుశాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలకు అవసరమైన అత్యవసర సదుపాయాలను కల్పించాలని తెలిపారు. నగరంలో పారిశుధ్య పనులు, డ్రైనేజ్ సమస్యలు లేకుండా చూడాలన్నారు.
Similar News
News December 5, 2025
జిల్లాకు ‘ప్రకాశం’ అని నామకరణం చేసింది ఈ రోజే!

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!
News December 5, 2025
ప్రకాశం: PTMకు ముస్తాబైన పాఠశాలలు

జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జిల్లాలోని 2,409 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాన్ని జరపాలని అన్నారు. PTM కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పాఠశాలల్లో పూర్తి చేసి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్తాబు చేశారు.
News December 5, 2025
కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.


