News January 24, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జాన్ పహడ్ దర్గాలో గంధం ఊరేగింపుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టరేట్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు. గురువారం వేబేక్స్ ద్వారా సంబంధిత అధికారులతో వీసీ నిర్వహించారు. 24,25 తేదీల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఆధికారులు ఆప్రమత్తంగా ఉండాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
Similar News
News November 11, 2025
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు: కలెక్టర్ తేజస్

సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి, మిల్లులకు పంపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం ఆయన తిరుమలగిరి మండలం తొండ, కోక్యా నాయక్ తండా, ఫణిగిరిలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యత కలిగిన ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం వహించవద్దని సూచించారు.
News November 11, 2025
ఏలూరు: ఈ కోర్సులో చేరేందుకు మెరిట్ లిస్ట్ విడుదల

ఏలూరు: హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సులలో ప్రవేశానికి 2వ ఫేజ్ కౌన్సిలింగ్కు మెరిట్ లిస్ట్ను గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నోటీసు బోర్డులో పొందుపరిచారు. ఈ విషయాన్ని ది వైద్య కళాశాల ప్రిన్సిపల్ సావిత్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 12న ఉదయం 10 గంటలకు కాలేజీలో వెరిఫికేషన్కు మెరిట్ లిస్టులోని అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలన్నారు.
News November 11, 2025
విశాఖ కలెక్టరేట్లో మైనారిటీ వెల్ఫేర్ డే

అబుల్ కలాం జయంతి పురస్కరించుకొని విశాఖ కలెక్టరేట్ లో జాతీయ విద్యా దినోత్సవం,మైనారిటీ వెల్ఫేర్ డే వేడుకలు మంగళవారం నిర్వహించారు.కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ ఆనందపురంలో పీకేరు గ్రామంలో నాలుగు ఎకరాల భూమిలో ముస్లింలకు బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మైనారిటీ సొసైటీ భూములు 22ఏ నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.


