News August 18, 2024
అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు: MLA రవికుమార్

తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలకు వెనకాడబోమని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు శాఖల వారీగా చర్చ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు సక్రమంగా అందించలేదని, అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి ఎంపీడీవో వరప్రసాద్, ఎంపీపీ రమాదేవి పాల్గొన్నారు.
Similar News
News November 10, 2025
శ్రీకాకుళం కలెక్టర్ గ్రీవెన్స్కు 102 అర్జీలు

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్కు జిల్లా నలుమూలల నుంచి 102 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. అందులో రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్తు సంస్థ వంటి పలు శాఖలకు దరఖాస్తులు అందాయన్నారు. త్వరగతిన అర్జీలు పూర్తి చేయాలని అధికారులను సూచించారు.
News November 10, 2025
యాక్సిడెంట్.. ఒకరి మృతి

నరసన్నపేట మండలం కోమార్తి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కారు మరమ్మతులకు గురికావడంతో పెద్దపాడు నుంచి మెకానిక్ కోరాడ వెంకటేశ్ వచ్చి మరమ్మతులు చేస్తున్నాడు. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ మృతిచెందగా కారులో ఉన్న సంతోశ్, సుశీల, శ్యాముల్ గాయపడ్డారు.
News November 10, 2025
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్లో 53 అర్జీల స్వీకరణ

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్లో 53 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ K.V.మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.


