News August 18, 2024

అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు: MLA రవికుమార్

image

తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలకు వెనకాడబోమని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు శాఖల వారీగా చర్చ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు సక్రమంగా అందించలేదని, అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో వరప్రసాద్, ఎంపీపీ రమాదేవి పాల్గొన్నారు.

Similar News

News July 10, 2025

కళింగపట్నంలో నిర్మాణ పనులను పరిశీలించిన రామ్మెాహన్

image

ఎత్తిపోతల పథకం పనులు త్వరగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానాయన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. వంశధార నదిలో నిర్మాణం జరుగుతున్న కళింగపట్నం వమరవెల్లి ఎత్తిపోతల పథకం పనులను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకంతో ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు స్థితిగతులను ఎమ్మెల్యే గొండు శంకర్‌ను అడిగి తెలుసుకున్నారు.

News July 10, 2025

శ్రీకాకుళంలో నేడు ఉద్యోగ మేళా..!

image

శ్రీకాకుళంలోని బలగ గవర్నమెంట్ ఐటిఐలో గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. మేళాలో హైదరాబాద్ హెటిరో డ్రగ్స్ ఫార్మాసిటికల్ కంపెనీలో వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఇంటర్, డిప్లొమా మెకానికల్, ఐటిఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు కళాశాలలో హాజరవ్వాలన్నారు.

News July 10, 2025

మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత: SP

image

మహిళలు భద్రతకు జిల్లా పోలీసుశాఖ మొదటి ప్రాధాన్యత, బాధ్యతగా తీసుకుంటుందని SP మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో నారీశక్తి కార్యక్రమం పేరిట మహిళల భద్రతపై విస్తృత స్థాయిలో పట్టణ, గ్రామీణ ప్రజానీకానికి, జిల్లాలో గల పోలీస్ స్టేషన్ ద్వారా చైతన్యవంతం చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.