News December 19, 2024

 అధికారులు సంసిద్ధం కావాలి: ప్రకాశం కలెక్టర్

image

సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీకి అధికారులు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. యువ ఓటర్ల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సాధారణ జనాభాకు ఓటర్ల జాబితా నిష్పత్తిని సరి చూసుకోవాలన్నారు.

Similar News

News November 18, 2025

ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

image

ఆన్‌లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్ల ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

News November 18, 2025

ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

image

ఆన్‌లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్ల ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

News November 18, 2025

ప్రకాశం: అన్నదాత సుఖీభవ నగదు జమ.. ఎంతమంది అర్హులంటే?

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేపు రెండవ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 268165 మంది రైతులకు రూ.134 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జమవుతుందని, అలాగే 21వ విడత పిఎం కిసాన్ పథకం నగదు రూ.231000 మంది రైతులకు రూ. 46.28 కోట్లు నగదు జమ కానుందన్నారు.