News January 26, 2025

అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి సాధించాలి: మంత్రి

image

అవుకు మండలంలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మండలంలో అన్ని విధాల అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం అవుకు మండలం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి బీసీ పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇరిగేషన్ ఈఈ సురేశ్ బాబు, ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Similar News

News October 22, 2025

BPT-2848 వరి పోషకాలను ఇలా అందించాలని ప్లాన్

image

బ్లాక్, రెడ్ రైస్ ధాన్యం పైపొరలో యాంతోసైనిన్ అనే పదార్థం వల్ల వాటికి ఆ రంగు వస్తుంది. ఈ పొరలో జింక్, ఐరన్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. BPT-2848లో ఈ పోషకాల శాతం చాలా ఎక్కువ. అందుకే ఈ రైస్ పౌడర్‌ను పిల్లలకు బేబీ ఫుడ్‌లా అందించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఉప్మారవ్వ, పౌడర్, జావ, పాయసం, కేకులు, అటుకులు, వడియాలు, సేమియా రూపంలోనూ ఈ రకాన్ని అందించాలని బాపట్ల వరి పరిశోధనాస్థానం ఇప్పటికే నిర్ణయించింది.

News October 22, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక గేటు నుంచి నీటి విడుదల

image

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగాల నుంచి స్వల్పంగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి 4,048 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులోకి 4,048 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలతో నిండుకుండలా మారింది.

News October 22, 2025

జీకే వీధి: డోలి మోతలోనే యువతి మృతి

image

జీకే వీధి (M) నేలపాడులో సుమిత్ర (22) మంగళవారం కాఫీ తోటకు వెళుతూ మార్గ మధ్యలో స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన గ్రామస్థులు ఆమెను డోలి కట్టి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. తమ గ్రామానికి రోడ్డు సదుపాయం ఉంటే తమ బిడ్డ బతికేదని, డోలిలో తీసుకెళ్లడం వల్ల వైద్యం సకాలంలో అందక మృతి చెందిందని కుటుంబీకులు వాపోయారు.