News February 8, 2025

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం జరగనున్న మహా కుంభాభిషేకం చివరి రోజు మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

Similar News

News November 25, 2025

SKLM: మృత్యువుగా మారిన 3 చక్రాల బండి

image

మందస మండలం వీజీపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సింహాచలం (43) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సింహాచలం 3 చక్రాల స్కూటీపై జాతీయరహదారిపై ప్రయాణిస్తున్నాడు. ప్రమాదవశాత్తు అది బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108లో హరిపురం సీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. మందస పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 25, 2025

నంద్యాల: కేసీ కెనాల్‌లో బాలుడి మృతదేహం

image

గోస్పాడు మండలం సాంబవరం గ్రామం వద్ద కేసీ కెనాల్‌లో పొన్నాపురానికి చెందిన ఖాజావలి అనే బాలుడి మృతదేహం లభ్యమయింది. ఖాజావలి సోమవారం మధ్యాహ్నం కేసీ కెనాల్ వద్ద ఆడుకుంటుండగా జారి కెనాల్‌లో పడ్డాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సాంబవరం గ్రామం వద్ద ఖాజావలి మృతదేహం లభ్యమయింది. ఘటనపై గోస్పాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 25, 2025

మంచిర్యాల: ‘మగవారికి వ్యాసెక్టమీ సురక్షితం’

image

ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబం పురుషుల భాగస్వామ్యంతోనే నిజమవుతుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.అనిత అన్నారు. మంచిర్యాల లో వేసక్టమి అవగాహన వాల్ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 21నుంచి డిసెంబర్ 4వరకు అవగాహన, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని వివరించారు. పురుషులకు కోత, కుట్టులేని వ్యాసెక్టమీ, ఎన్ఎస్వీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు సురక్షితమైనవన్నారు.