News February 8, 2025
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం జరగనున్న మహా కుంభాభిషేకం చివరి రోజు మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
Similar News
News November 22, 2025
పెద్దపల్లి: అట్టర్ ఫ్లాప్ సీఎం రేవంత్ రెడ్డి: మాజీ ఎమ్మెల్యే

అట్టర్ ఫ్లాప్ సీఎం రేవంత్ రెడ్డి అని RMG Ex.MLA కోరుకంటి చందర్ ఘాటుగా విమర్శించారు. PDPLలోని BRS జిల్లా కార్యాలయంలో శుక్రవారం PDPL Ex.MLA మనోహర్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పాలన చేతగాక CM రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫార్మూలా ఈ కార్ రేసింగ్ కేసు తెరపైకి తెచ్చారని, ఇది కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న డ్రామా అన్నారు.
News November 22, 2025
PHOTO GALLERY: భారతీయ కళా మహోత్సవం

HYD బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్ ఎడిషన్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. నేటి ప్రదర్శనల ఫొటోలు పైన చూడవచ్చు.
News November 22, 2025
Western Indiaకు వేదికైన రాష్ట్రపతి నిలయం

రాష్ట్రపతి నిలయం Western India కల్చర్కు వేదికైంది. శుక్రవారం ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ‘భారతీయ కళా మహోత్సవం’ ప్రారంభించారు. రేపటి నుంచి సాధారణ ప్రజలు సైతం పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని వీక్షించొచ్చు. గుజరాత్, రాజస్థాన్ కళలు, పైతానీ చీరలు, గోవా కుంబీ చీలను ప్రదర్శిస్తున్నారు. బుక్ ఫెయిర్ కూడా ఉంది. గుజరాత్ గార్భా, రాస్, గోవా సమాయి, డామన్-డయ్యూ, దాద్రానగర్-హవేలీ నృత్యాలు ఉంటాయి.


