News January 28, 2025

అధికారులు సిద్ధంగా ఉండాలి: బాపట్ల కలెక్టర్

image

బాపట్ల కలెక్టరేట్ నందు మంగళవారం జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి ఆయా శాఖల జిల్లా అధికారులు నివేదికలను అందజేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

Similar News

News October 24, 2025

శేష వాహనంపై కురుమూర్తి రాయుడు

image

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కురుమూర్తి స్వామివారు పద్మావతి సతీసమేతంగా శేషవాహనంపై ఊరేగింపులో దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల మధ్య పల్లకీ సేవ నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి మోకాళ్ల గుండు వరకు స్వామివారు విహరించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగాయి. శేషవాహనం దాస్యభక్తికి నిదర్శనమని భక్తులు విశ్వసిస్తారు.

News October 24, 2025

FLASH: సిద్దిపేట జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 25 నుంచి నవంబర్ 9 వరకు సిటీ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు అనుమతులు లేకుండా నిర్వహించకూడని చెప్పారు. బలవంతంగా వ్యాపార సముదాయాలు మూయించడం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 24, 2025

జిల్లా జైలను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జ్

image

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా కరీంనగర్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ జిల్లా కారాగారాన్ని సందర్శించి, ఖైదీలకు అందుతున్న సేవలను తనిఖీ చేశారు. విచారణ ఖైదీలు జిల్లా కారాగారాన్ని ఒక పరివర్తన కేంద్రంగా భావించాలని, కారాగారంలో గడిపిన కాలంలో సత్ప్రవర్తనతో మెలిగి బయటకు వెళ్లిన తర్వాత క్షణికావేశాలకు లోనుకాకుండా ఉండాలని తెలియజేశారు.