News January 28, 2025
అధికారులు సిద్ధంగా ఉండాలి: బాపట్ల కలెక్టర్

బాపట్ల కలెక్టరేట్ నందు మంగళవారం జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి ఆయా శాఖల జిల్లా అధికారులు నివేదికలను అందజేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ప్రజావాణి కార్యక్రమం వాయిదా
> జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటిన స్టేషన్ ఘనపూర్ విద్యార్థులు
> షెడ్యూల్ కులాల రిజర్వేషన్ పెంచాలి: కడియం
> తప్పుడుగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని NSUI నేతల డిమాండ్
> ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
> సోమేశ్వరాలయానికి అరకిలో వెండి పూర్ణకుంభం అందజేత
News February 9, 2025
భూపాలపల్లి జిల్లా పరిధి నేటి ముఖ్యాంశాలు

✓ కాళేశ్వరం మహాకుంబాభిషేకం ఉత్సవాలకు హాజరైన మంత్రులు కొండ సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ✓ మహాదేవపూర్ చెరువులో పడి వ్యక్తి మృతి✓ రేగొండలో అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు✓ ధన్వాడ దత్తాత్రేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు✓ గణపురం కోటగుళ్లలో సందడి చేసిన పాఠశాల విద్యార్థులు✓ చిట్యాల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
News February 9, 2025
సికింద్రాబాద్: షాపింగ్ మాల్లో సూసైడ్ అటెంప్ట్!

సికింద్రాబాద్లో ఆదివారం దారుణం జరిగింది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఓ షాపింగ్ మాల్లో భార్య మౌనిక పని చేస్తుండగా ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ పరుగులు తీశారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.