News July 24, 2024
అధికార యంత్రంగం సమష్టిగా పనిచేయాలి: కలెక్టర్ నాగలక్ష్మి

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్గా భార్గవ్ తేజ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన కలెక్టర్ను కలిసి పుప్పగుచ్ఛం అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెవెన్యూ, పౌరసరఫరాల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా కృషి చేయాలని చెప్పారు.
Similar News
News December 1, 2025
GNT: మళ్లీ తెరపైకి ఆ ఎంపీ పేరు.!

2026 జూన్లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ రాజ్యసభ రేసులో గల్లా జయదేవ్ పేరు మళ్లీ వినిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది. పరిశ్రమలు, పెట్టుబడులపై ఆయన స్పష్టమైన అభిప్రాయాలు, పరిపాలనలో పారదర్శకతకు ఆయన ఇచ్చే ప్రాధాన్యం మళ్లీ హైలైట్ అవుతోంది. కాగా గతంలో గుంటూరు జిల్లా నుంచి అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి ఇద్దరు రాజ్యసభకి ఎన్నికవటంతో గల్లా పేరుకు ప్రాముఖ్యం ఉంది.
News December 1, 2025
గుంటూరులో 2,56,904 మందికి రూ.111.34కోట్ల పంపిణీ

జిల్లాలో ప్రతి నెల 2,56,904 మందికి లబ్దిదారులకు రూ.111.34కోట్ల పంపిణీ జరుగుతోంది. వీరిలో వృద్ధాప్యపు పింఛన్లు 1,18,174, వితంతు 70,112, చేనేత 3,862, గీతకార్మికులు 443, మత్స్యకారులు 570, ఒంటరి మహిళలు 11,330, చర్మకారులు 876, హిజ్రాలు 67, HIV బాధితులు 2,614, కళాకారులు 77, డప్పు కళాకారులు 854, దివ్యాంగులు 24,835, వైద్య సంబంధిత 1667, సైనిక సంక్షేమం 28, అభయహస్తం 3,994, అమరావతి భూముల సంబంధిత 17,401మంది.
News December 1, 2025
అమరావతిలో రూ.750 కోట్లతో యోగా, నేచురోపతి ఇన్స్టిట్యూట్

రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక ‘ఎపెక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా & నేచురోపతి’ ఏర్పాటు కానుంది. దీనికోసం త్వరలో 40 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం రూ. 750 కోట్ల భారీ వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. ఇందులో 450 పడకల నేచురోపతి ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. అలాగే యోగా, నేచురోపతి కోర్సుల్లో 100 (UG), 20 (PG) సీట్లతో విద్యావకాశాలు కల్పించనున్నారు.


