News March 10, 2025
అనంతగిరి: కుక్కల దాడిలో జింక మృతి

వీధి కుక్కల వేటలో జింక (దుప్పి ) మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవిలో వీధి కుక్కల వేటలో జింక మృతి(దుప్పి ) చెందిందని స్థానికులు తెలిపారు. ఉదయం గుంపుగా వచ్చిన కుక్కలు మూగజీవాలపై విరుచుకుపడ్డాయని చెప్పారు.
Similar News
News November 14, 2025
పిల్లల్లో ADHDకి మందులు వాడుతున్నారా?

కొందరు పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివ్ డిసీజ్ వస్తుంటుంది. అయితే కొందరు వైద్యులు వ్యాధి నిర్ధారణ అవ్వగానే మందులు ఇస్తారు. కానీ ఇది సరికాదంటోంది స్టాన్ఫర్డ్ మెడిసిన్ తాజా అధ్యయనం. ఆరేళ్లలోపు పిల్లల్లో మందులను ప్రాసెస్ చేసే మెటబాలిజం పూర్తిగా అభివృద్ధి చెందదు. కాబట్టి మందుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ దక్కదు. దానికంటే ముందు వాళ్లకు బిహేవియరల్ థెరపీ ఇవ్వాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
News November 14, 2025
కామారెడ్డి జిల్లాలో చలి ప్రభావం తీవ్రం

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. కనిష్టంగా ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. బొమ్మన్ దేవిపల్లి,గాంధారి,బీబీపేట లో 9.4°C, నస్రుల్లాబాద్ 9.5, జుక్కల్ 9.7, మేనూర్,రామలక్ష్మణపల్లి, లచ్చపేట లో 9.8, డోంగ్లి,సర్వాపూర్ లో 9.9, ఎల్పుగొండ, బీర్కూర్ లో10.1, నాగిరెడ్డిపేట 10.5, పుల్కల్ 10.7, లింగంపేట,బిచ్కుంద,రామారెడ్డి లో 10.8, భిక్కనూర్ 11°C లుగా నమోదయ్యాయి.
News November 14, 2025
వరల్డ్ క్లాస్ లెవెల్లో.. రూ.600 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి.!

విజయవాడ రైల్వే స్టేషన్ను PPP మోడల్ కింద రూ.600 కోట్లకు పైగా నిధులతో వరల్డ్ క్లాస్ వసతులతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే టెండర్లు పిలవగా, DEC 15తో గడువు ముగియనుంది. 24/7 వైఫై, AC హాల్స్, ప్రతి ప్లాట్ఫామ్పై ఎస్కలేటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు వంటి అనేక హంగులతో స్టేషన్ను తీర్చిదిద్దనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మోడల్ కింద ఎంపికైన ఏకైక స్టేషన్ విజయవాడ అని అధికారులు తెలిపారు.


