News March 3, 2025

అనంతగిరి: పదేళ్ల బాలికపై 30 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులు

image

బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన పదేళ్ల బాలికను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.

Similar News

News December 4, 2025

రంగారెడ్డి: తొలి విడతలో ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

రంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో 174 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆరుగురు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 168 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1,530 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 190 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,340 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 3,379 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

News December 4, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలి: కలెక్టర్

image

షెడ్యూల్ ప్రకారం అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన యూరియా, పొటాష్ తదితర రసాయన ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదనపు నిల్వలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News December 4, 2025

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: తిరుపతి కలెక్టర్

image

APSSDC ఆధ్వర్యంలో 6వ తేదీ గూడూరు పట్టణంలోని DRW డిగ్రీ కళాశాల జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 15 కంపెనీల ప్రతినిధులు వస్తారని, 700 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.