News March 3, 2025

అనంతగిరి: పదేళ్ల బాలికపై 30 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులు

image

బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన పదేళ్ల బాలికను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.

Similar News

News January 2, 2026

KMR: ఈ నెల 3న జాబ్ మేళా

image

కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల మూడో తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం చెప్పారు. బీపీఓ పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News January 2, 2026

ఈడుపుగల్లుకు రైలు కూత.. 49 కి.మీ కొత్త రైల్వే లైన్

image

తరిగొప్పుల-దుగ్గిరాల మధ్య ప్రతిపాదిత 49k.m కొత్త రైల్వే లైన్‌లో ఈడుపుగల్లు రైల్వేస్టేషన్ కేంద్రంగా మారనుంది. లొకేషన్ సర్వే, మట్టి నమూనాల పరిశీలన పూర్తికావడంతో భూసేకరణ, ట్రాక్‌, స్టేషన్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. తరిగొప్పుల నుంచి చీలి, మంతెన దక్షిణంగా రైవాస్ కాలువ మీదుగా ఈడుపుగల్లు,వణుకూరు వైపు ట్రాక్‌ వెళ్లనుంది. చోడవరం వద్ద రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికీ కసరత్తు సాగుతోంది.

News January 2, 2026

పిల్లలను పెంచలేక.. ఎవరూ ఆదరించక!

image

ముగ్గురు పిల్లలకు తండ్రి సురేంద్ర విషం ఇచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది. భార్య మరణంతో ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడగా, పిల్లల ఆలనాపాలనా చూసేందుకు ఎవరూ సాయం చేసేవారు కారట. కూలికి వెళ్తేగాని పూట గడవకపోవడం, పిల్లలను చూసుకోవడం భారంగా భావించే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. <<18730785>>తుడుమలదిన్నెలో<<>> జరిగిన అంత్యక్రియలకు సురేంద్ర బంధువులు, భార్య తల్లిదండ్రులు రాకపోవడం విచారకరం.