News October 4, 2024
అనంతపురంలో కిలో టమాటా రూ.77
అనంతపురం రూరల్ కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.77తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మార్కెట్కు మంగళవారం మొత్తంగా 630 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయని తెలిపారు. కిలో సరాసరి రూ.67, కనిష్ఠ ధర రూ.51 పలికినట్లు తెలిపారు. టమాటా ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది.
Similar News
News October 4, 2024
ATP: ఎద్దుల బండిపై నుంచి పడి బాలుడి మృతి
అనంత జిల్లా కణేకల్లు మండల కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. కురుబ జశ్వంత్ (6) అనే బాలుడు ఎద్దుల బండిపై నుంచి పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సెలవులు కావడంతో తండ్రితోపాటు శుక్రవారం ఉదయం ఎద్దుల బండిపై పొలానికి వెళుతుండగా అకస్మాత్తుగా కిందపడి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.
News October 4, 2024
ATP: 2,79,161 మందికి రూ.55.83 కోట్లు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 18వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు నిధులు విడదల చేయనుంది. ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున జమకానుంది. అనంతపురం జిల్లాలో 2,79,161 మందికి రూ.55.83 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా రైతులకు పంట సాయంగా ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే.
News October 4, 2024
బెనిఫిట్స్ త్వరగా వచ్చే విధంగా చూడండి: ఎస్పీ
పోలీస్ శాఖలో పనిచేస్తూ చనిపోయిన, పదవి విరమణ పొందిన వారికి రావలసిన బెనిఫిట్స్ త్వరగా అందేలా చూడాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో డిపిఓ సిబ్బంది, అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పదవి విరమణ పొందిన వారికి, మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయో వాటి వివరాలు తెలపాలని పేర్కొన్నారు.