News March 20, 2025
అనంతపురంలో యువతి ఆత్మహత్య

అనంతపురంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మైథిలి అనే యువతి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 10న మైథిలి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 10, 2025
అల్లూరి: ఫోన్ ఎక్కువ మాట్లాడొద్దని మందలించిన భర్తను చంపిన భార్య

భర్తను భార్య హత్య చేసిన ఘటన చింతపల్లి మండలం మేడూరులో జరిగింది. భార్య ఫోన్ ఎక్కువగా మాట్లాడుతోందని మందలించడంతో భర్త రాజారావుపై గొడ్డలితో భార్య దాడి చేసింది. తీవ్ర గాయాలైన రాజారావును స్థానికులు కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
News December 10, 2025
MBNR: మూడో విడతలో 440 మంది సర్పంచ్ అభ్యర్థులు.!

మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత పోరు రసవత్తరంగా మారింది. ఈ విడతలో మొత్తం 440 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అడ్డాకల్, బాలానగర్, భూత్పూర్, జడ్చర్ల, మూసాపేట మండలాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జడ్చర్ల మండలానికి సంబంధించి ఒక గ్రామ పంచాయతీలో నామినేషన్ సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.
News December 10, 2025
NGKL: పొలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా జరగాలి: కలెక్టర్

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రక్రియతో పాటు ఓట్ల లెక్కింపు సజావుగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కోరారు. రేపు ఉదయం 7 గంటలకు 137 గ్రామ పంచాయతీలలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సిబ్బందితో పాటు అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల విధులకు 6000 మందికిపైగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.


