News July 11, 2024
అనంతపురంలో 12న ఉద్యోగ మేళా

అనంతపురం నగరంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పూల్ క్యాంపస్ డ్రైవ్ సంస్థ వైస్ ఛైర్మన్ చక్రధర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి అనంత జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2023, 2024లో బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 8.30 గంటలకు అభ్యర్థులు మౌఖిక పరీక్షలకు హాజరుకావాలన్నారు.
Similar News
News November 1, 2025
ఒకే ఇంట్లో ఆరుగురికి పింఛన్.. ₹36వేలు అందజేత

అనంతపురంలోని 26వ డివిజన్ హమాలీ కాలనీలో ఒకే ఇంట్లో ఆరుగురు దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. సయ్యద్ కుటుంబంలోని ఆరుగురు (సయ్యద్, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, మనుమడు) మూగవారు కావడంతో, వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున పింఛను మంజూరు చేస్తోంది. శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వారందరికీ పింఛన్లను అందజేశారు. రూ.36వేలు అందించారు.
News November 1, 2025
ఖాళీల భర్తీలు పక్కా ఉండాలి: అనంత కలెక్టర్

ఐసీడీఎస్లో ఖాళీల భర్తీకి నిబంధనల ఉల్లంఘనకు తావులేదని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 36 వర్కర్లు, 68 హెల్పర్లు కలిపి మొత్తం 104 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News October 31, 2025
పోలీసు అమరవీరులకు జోహార్లు

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జిల్లా ఎస్పీ జగదీశ్ జోహార్లు తెలిపారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల ముగింపు రోజున శుక్రవారం అనంతపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ జగదీష్, ఇతర పోలీస్ అధికారులు అమర వీరులకు నివాళులర్పించారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరాలు, వ్యాస రచన పోటీలు, ఉచిత వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు SP తెలిపారు.


