News September 15, 2024
అనంతపురంలో 19న ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం

అనంతపురంలోని కలెక్టరేట్లో ఈ నెల 19న ఉదయం11 గంటలకు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో హంద్రీనీవా, మైనర్ ఇరిగేషన్తో పాటు హెచ్చెల్సీకి కేటాయించిన నీటి విడుదల తేదీలను ప్రకటిస్తామన్నారు. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
Similar News
News February 24, 2026
ఇంటర్ పరీక్షలకు 359 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు 64 పరీక్ష కేంద్రాలలో జరిగినట్లు ఆర్ఐవో రమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 20,919లో 20,588 మంది హాజరు కాగా 331 మంది గైర్హాజర్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,900 గాను 1,872 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను సిసి కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామని ఆయన తెలిపారు.
News February 24, 2026
అనంతపురం జిల్లాలో మొదలైన ఇంటర్ సెకండియర్ పరీక్షలు

అనంతపురం జిల్లాలోని 64 కేంద్రాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నోటీసు బోర్డుల వద్ద ఏర్పాటు చేసిన రోల్ నంబర్ల షీట్లను సరిచూసుకుని లోపలికి వెళ్లారు. అధికారులు నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
News February 23, 2026
ఉపాధి హామీ బిల్లుల అప్లోడ్పై కలెక్టర్ కఠిన ఆదేశాలు

ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ ఎక్స్పెండేచర్ బిల్లులను ప్రత్యేక దృష్టితో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులకు ఆదేశించారు. నమోదు చేయాల్సిన రూ.131 కోట్లలో ఇప్పటివరకు రూ.86.87 కోట్లు మాత్రమే నమోదు అయ్యాయని, మిగిలిన రూ.44.48 కోట్ల బిల్లులను మార్చి 10 లోపు పూర్తి చేయాలన్నారు. ఏ బిల్లు 24 గంటలకు మించి పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. సంబంధిత శాఖలు లక్ష్యాలు సాధించాలన్నారు.


