News August 31, 2024

అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై లారీ బోల్తా 

image

బేస్తవారిపేట పట్టణ సమీపంలోని అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నరసరావుపేట నుంచి గుంతకల్లు వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తులో లారీని డివైడర్‌పైకి ఎక్కించాడు. దీంతో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.

Similar News

News September 30, 2024

పింఛన్లపై ప్రకాశం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా అక్టోబర్ 2024కి సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు, డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 1న పెన్షన్ పంపిణీ 100 శాతం పంపిణీ చేయాలన్నారు.

News September 29, 2024

ప్రకాశం జిల్లాలో నూతన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు వీరే

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ఎక్సైజ్ శాఖ స్టేషన్లకు ఇన్‌స్పెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
➤ ఒంగోలు – A. లినా
➤ మార్కాపురం – వెంకటరెడ్డి
➤ చీమకుర్తి – M. సుకన్య
➤ సింగరాయకొండ – M. శివకుమారి
➤ పొదిలి – T. అరుణకుమారి
➤ దర్శి – శ్రీనివాసరావు
➤ కనిగిరి – R. విజయభాస్కరరావు
➤ గిద్దలూరు – M. జయరావు
➤ కంభం – కొండారెడ్డి
➤ యర్రగొండపాలెం – CH శ్రీనివాసులు
➤ కందుకూరు – వెంకటరావు

News September 29, 2024

బూచేపల్లి బాధ్యతల స్వీకరణకు.. డేట్ ఫిక్స్.!

image

ప్రకాశం జిల్లా వైసీపీ నూతన అధ్యక్షులుగా నియమితులైన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్టోబర్ 4 ఉదయం 10 గంటలకు, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రకాశం జిల్లాలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైసీపీ కార్యాలయ ప్రతినిధులు ఆదివారం తెలిపారు.