News March 13, 2025
అనంతపురం కోర్టులో నారా లోకేశ్పై ఫిర్యాదు

అనంతపురం కోర్టులో మంత్రి నారా లోకేశ్పై వైసీపీ నేత చవ్వా రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రులు రోజా, విడదల రజిని ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించామన్నారు. ఆ పోస్టుల వెనుక లోకేశ్ ఉన్నారని ఆరోపించారు.
Similar News
News October 26, 2025
Pic Of The Day

తాడిపత్రి పరిసరాలు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు ఆకర్షణీయ స్థలంగా మారుతున్నాయి. ఆలూరు కోన దేవస్థానం, జలపాతం, ఓబులేసు కోన ఘాట్ రోడ్లు తిరుమల దారులను తలపిస్తున్నాయి. అక్కడి నుంచి కనిపించే పచ్చని కొండలు, పంట పొలాలు తాడిపత్రి అందాలను మరింత అద్భుతంగా చూపిస్తున్నాయి. సెలవుల్లో ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ప్రకృతి అందాలు, పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు.
News October 26, 2025
జిల్లాస్థాయి చెస్ పోటీలకు తాడిపత్రి విద్యార్థి ఎంపిక

జిల్లా స్థాయి చెస్ పోటీలకు తాడిపత్రి విద్యార్థి లిఖిలేశ్వర్ రావు ఎంపికైనట్లు కోచ్ పవన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని జూనియర్ కళాశాలలో జరిగిన మండల స్థాయి చెస్ పోటీలలో అండర్ -17 విభాగంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి లిఖిలేశ్వర్ రావు ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఎంపికైన విద్యార్థిని అధ్యాపక బృందం, కోచ్ పవన్ కుమార్ రెడ్డి అభినందించారు.
News October 25, 2025
రాయదుర్గం: ఇన్స్టాగ్రాం పిచ్చి.. మృత్యువుకు దారి తీసింది

BTP డ్యాం స్పిల్ వే గేటు వద్ద గల్లంతైన యువకుడి వివరాలు లభ్యమయ్యాయి. రాయదుర్గంలోని కలేగార్ వీధికి చెందిన ముగ్గురు యువకులు డ్యాం గేట్లు ఓపెన్ చేస్తుండటంతో ఇన్స్టాగ్రాం వీడియోల కోసం వెళ్లారు. అందులో ఇద్దరు నీటిలో ఈత కొడుతూ.. గల్లంతయ్యారు. వారిలో ఒకరు బయటకురాగా మరో యువకుడు మహమ్మద్ ఫైజ్ ఆచూకీ లభించలేదు. చివరకు మత్స్యకారులు మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని విలపించారు.


