News September 10, 2024
అనంతపురం చేరుకున్న భారత్-ఏ, బీ జట్ల ప్లేయర్లు

అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ క్రికెట్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడిన భారత్-ఏ, బీ జట్లు నిన్న రాత్రి అనంతపురానికి చేరుకున్నాయి. కేఎల్ రాహుల్, దూబే, పంత్, మయాంక్, రియాన్ పరాగ్ తదితర క్రికెటర్లకు హోటళ్లలో ఘన స్వాగతం పలికారు. క్రికెట్లరను చూడటానికి అభిమానులు హోటల్ వద్ద పడిగాపులు కాశారు. క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Similar News
News February 26, 2026
అనంత: ఇంటర్ సెకండియర్ పరీక్షలు.. 368 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లాలో 64 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సజావుగా జరిగినట్లు ఆర్ఐవో వెంకటరమణ నాయక తెలిపారు. గురువారం ఉదయం జరిగిన ఇంటర్ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 20,855 గాను 20,517 మంది హాజరవ్వగా.. 338 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,931కి గాను 1,901 మంది హాజరై 30 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
News February 26, 2026
అనంత: ఇంటర్ సెకండియర్ పరీక్షలు.. 368 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లాలో 64 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సజావుగా జరిగినట్లు ఆర్ఐవో వెంకటరమణ నాయక తెలిపారు. గురువారం ఉదయం జరిగిన ఇంటర్ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 20,855 గాను 20,517 మంది హాజరవ్వగా.. 338 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,931కి గాను 1,901 మంది హాజరై 30 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
News February 26, 2026
31,972 మంది విద్యార్థులు.. 143 పరీక్ష కేంద్రాలు

అనంతపురం జిల్లాలో మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 143 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు 31,972 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


