News September 27, 2024

అనంతపురం జిల్లాలో మరో దారుణం.. చిన్నారిపై అఘాయిత్యం

image

అనంతపురం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. పుట్లూరు మండలం శనగలగూడూరులో 10 ఏళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో తిరుపాలుకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News October 10, 2024

ఏపీ ప్రజలతోనూ రతన్ టాటాకు అనుబంధం: మంత్రి పయ్యావుల

image

ఏపీ ప్రజలతో దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటాకు మంచి అనుబంధం ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతిలో మంత్రివర్గం టాటాకు నివాళులు అర్పించింది. ఉప్పు నుంచి ఉక్కు దాకా టాటా గ్రూప్ అనేక సంస్థలను స్థాపించిందని, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిదని గుర్తు చేసుకున్నారు. టాటా సంస్థలు ఇప్పటికీ ఏపీ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు.

News October 10, 2024

శ్రీ సత్యసాయి బాబాతో రతన్ టాటాకు అనుబంధం

image

టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్, ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా శ్రీ సత్యసాయిబాబా భక్తుడు. పలుమార్లు ఆయన పుట్టపర్తికి వచ్చారు. 2009 డిసెంబర్ 3న చివరిసారిగా సాయిబాబాను దర్శించుకున్నారు. సత్యసాయిబాబా సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై రతన్ టాటా ఆసక్తి చూపించేవారు. రతన్ టాటాకు ప్రశాంతి నిలయంతో ప్రత్యేక అనుబంధం ఉంది.

News October 10, 2024

SKU పరిధిలో డిగ్రీ 2వ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

image

SKU పరిధిలో డిగ్రీ రెండో సెమిస్టర్‌ ఫలితాలను యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ బి.అనిత విడుదల చేశారు. మొత్తం 8,551 మంది పరీక్ష రాయగా 3,392 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో BAలో 461 మందికి గానూ 108 మంది, BBAలో 818 మందికి గానూ 353 మంది, BCAలో 174 మందికి గానూ 62 మంది, BCMలో 4,512 మందికి గానూ 1,635 మంది, BSCలో 2,586 మందికి గానూ 1,234 మంది ఉత్తీర్ణత చెందారు.