News February 23, 2025
అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో 9,993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
Similar News
News November 13, 2025
హోంమంత్రి సీరియస్.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్

హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై కలెక్టర్ విజయకృష్ణన్ చర్యలు తీసుకున్నారు. 2 రోజుల క్రితం హోంమంత్రి ఎస్.రాయవరం మండలం పెట్టుగోళ్లపల్లిలో కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు <<18272386>>ట్యాంకు లీకేజీ<<>>ని గమనించారు. అధికారులు పొంతన లేని సమాధానం చెప్పడంతో ప్రారంభించకుండానే వెనుదిరిగారు. ఆమె ఆదేశాలతో డీఈ, ఏఈలను సస్పెండ్ చేశారు.
News November 13, 2025
పెండింగ్ పనులు పూర్తి చేయాలి: ADB కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం నేరడిగొండ, భీంపూర్, బేలా, బోథ్, జైనథ్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కిచెన్ షెడ్, ప్రహరీగోడ, ఇతర మౌలిక సదుపాయాల పురోగతిపై రెండవ దశ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు ITDA PA యువరాజ్ మర్మాట్ తదితరులు ఉన్నారు.
News November 13, 2025
GWL: అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి

జిల్లావ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్లో ఉన్న పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్, ఎన్ఆర్ఈజీఎస్, ఆర్థిక సంఘం నిధులతో ఆయా కేంద్రాల్లో మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్ తదితర పనులు ఎందుకు పూర్తి కాలేదన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించి డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలన్నారు.


