News September 23, 2024

అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా రామచంద్రారెడ్డి

image

అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా రామచంద్రారెడ్డి నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్న ఓబులమ్మను కడప జిల్లా పరిషత్ సీఈవోగా బదిలీ చేశారు. రామచంద్రారెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లా DWMAలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Similar News

News October 24, 2025

కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

image

భారీ వర్షాల నేపధ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదన్నారు. ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం 8500292992కు కాల్ చేయాలన్నారు.

News October 24, 2025

పోలీసుల సేవలపై వ్యాసరచన పోటీలు: ఎస్పీ

image

పోలీసుల అమర వీరుల వారోత్సవాలు జరుగుతున్నట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసుల విధులు, సేవలు, త్యాగాల గురించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. పోలీసుల సేవలపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని ఎస్పీ తెలిపారు.

News October 23, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

image

ఇటీవల అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో యాడికికి చెందిన విద్యార్థి తృషిత అత్యంత ప్రతిభ కనబరిచింది. దీంతో గుంతకల్ డివిజన్ జట్టుకు ఎంపికయింది. డివిజనల్ స్థాయి పోటీలలోనూ అత్యంత ప్రతిభ కనబరిచడంతో నిర్వాహకులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో తృషిత పాల్గొంటుంది.