News October 5, 2024
అనంతపురం జిల్లా యువకుడిపై పోక్సో కేసు
అనంత జిల్లా యువకుడిపై HYD పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన లోకేశ్కు అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఉంది. చనువు పెరగడంతో యువతి తన ఫొటోలను అతడికి పంపింది. ఇదే అదునుగా యువకుడు నగ్నవీడియోలు పంపాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. అతడి వేధింపులతో ట్యాంక్ బండ్ వద్ద సూసైడ్ వరకు వెళ్లిన యువతి విషయాన్ని సోదరుడికి చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Similar News
News October 5, 2024
‘ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి.. ఆదర్శ గురువులుగా మారి’
అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుదర్శన రావు, శశిధర్ అనేక మంది విద్యార్థులను ఇంజినీర్లుగా మార్చారు. గతంలో వారి ప్రభుత్వ ఇంజినీర్ ఉద్యోగాలను సైతం వదిలిపెట్టి ప్రొఫెసర్లుగా బోధన మార్గాన్నే ఎంచుకొని ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాలలో ఇంజినీర్లుగా, పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో JE, AE, AEEలుగా తీర్చదిద్దారు.
News October 5, 2024
అనంత: దసరా సెలవులలో ఊళ్లకు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
అనంతపురం: దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ సీఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. దొంగతనాలు జరుగకుండా ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ప్రజలు సహకరించి సీసీఎస్ పోలీసులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులు, బంగారం దొంగల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు.
News October 5, 2024
అనంతపురం జిల్లా యువకుడిపై పోక్సో కేసు
అనంత జిల్లా యువకుడిపై HYD పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన లోకేశ్కు అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఉంది. చనువు పెరగడంతో యువతి తన ఫొటోలను అతడికి పంపింది. ఇదే అదునుగా యువకుడు నగ్నవీడియోలు పంపాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. అతడి వేధింపులతో ట్యాంక్ బండ్ వద్ద సూసైడ్ వరకు వెళ్లిన యువతి విషయాన్ని సోదరుడికి చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.