News December 11, 2024
అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు: ఎస్పీ
అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు, దాడులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వివరాలను ఎస్పీ జగదీశ్ బుధవారం వెల్లండించారు. జిల్లాలో గడచిన 24 గంటలలో రోడ్డు భద్రతా ఉల్లంఘనలపై 789 కేసులు నమోదు చేసి రూ.1,86,350 ఫైన్స్ విధించామన్నారు. బహిరంగంగా మద్యం తాగిన వారిపై ఓపెన్ డ్రింకింగ్ 61 కేసులు, డ్రంకన్ డ్రైవింగ్పై 20 కేసులు నమోదు చేశామన్నారు.
Similar News
News January 19, 2025
పద్యాలతో జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన: JNTU ఇన్ఛార్జ్ వీసీ
అనంతపురం JNTUలోని పరిపాలన భవనంలో ఆదివారం యోగి వేమన జయంతిని పురస్కరించుకొని JNTU ఇన్ఛార్జ్ వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్యతో కలిసి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇన్ఛార్జ్ వీసీ మాట్లాడుతూ.. ఎంతో అద్భుతమైన పద్యాలతో ప్రపంచానికి జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన అని కొనియాడారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
News January 19, 2025
అనంత: మాజీ ఎమ్యెల్యే సోదరుడిపై కేసు నమోదు
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై శనివారం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముత్యాలు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2022 సంవత్సరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్లపై అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేసినట్లు రాప్తాడు సీఐ శ్రీహర్ష వెల్లడించారు.
News January 19, 2025
ఈనెల 21న శ్రీ సత్యసాయి జిల్లాకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతా హుస్సేన్ ఈనెల 21న శ్రీ సత్యసాయి జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం కదిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారన్నారు. అనంతరం రాందాస్ తండా, బోడే నాయక్ తండాను పరిశీలిస్తారని తెలిపారు. ముదిగుబ్బ మండలం మీదుగా ఉదయం 11 గంటలకు జొన్నల కొత్తపల్లి తండాను సందర్శిస్తారని వెల్లడించారు.