News June 3, 2024
అనంతపురం నియోజకవర్గాల కౌంటింగ్ ప్రాంతాలు ఇవే..!

రాయదుర్గం కౌంటింగ్ ప్రధాన భవనం ఫస్ట్ ఫ్లోర్, ఉరవకొండ అడ్మినిస్టేటివ్ భవనం గ్రౌండ్ ఫ్లోర్, గుంతకల్లు మెయిన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, తాడిపత్రి మెయిన్ బిల్డింగ్ సౌత్వింగ్ గ్రౌండ్ ఫ్లోర్, శింగనమల ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, అనంతపురం కౌంటింగ్ ఈసీఈ గ్రౌండ్ ఫ్లోర్, కళ్యాణదుర్గం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, రాప్తాడు ఈసీఈ నార్త్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లో నిర్వహించనున్నారు.
Similar News
News November 16, 2025
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 16, 2025
భర్త హత్యాయత్నం ఘటనలో భార్య మృతి

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో అనుమానంతో ఎర్రిస్వామి తన భార్య రత్నమ్మను కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకుంది. రత్నమ్మను కుటుంబసభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
News November 14, 2025
రైలు ట్రాక్ పక్కన వ్యక్తి మృతదేహం

పెద్దపప్పూరు మండల పరిధిలోని జూటూరు-కోమలి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ట్రాక్ పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. స్థానికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి మృతి చెందాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.


