News November 12, 2024

అనంతపురం: వీళ్లు పట్టు.. ఉడుం పట్టు

image

అనంతపురం జిల్లా క్రీడాకారులు కుస్తీ పోటీల్లో పట్టు పట్టారంటే మెడల్ రావాల్సిందే అన్నట్లు దూసుకెళ్తున్నారు. కొద్దిరోజులుగా జరుగుతున్న స్కూల్‌ గేమ్స్‌ల్లో అండర్ -17 బాలుర విభాగంలో రోహిత్, బాలికల విభాగంలో రాణి గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయిలో పోటీ పడి గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో వారు ఢిల్లీలో డిసెంబర్ 23న జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని కుస్తీ కోచ్ రాఘవేంద్ర తెలిపారు.

Similar News

News March 9, 2026

అసాంఘిక పనులకు పాల్పడితే కఠిన చర్యలు: SP

image

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో సక్రమ ప్రవర్తన ఎంత ముఖ్యమో పోలీసు అధికారులు వారికి అవగాహన కల్పించారు. పాత నేరాలను వదిలిపెట్టి, బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. ఎవరైనా తిరిగి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News March 8, 2026

1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

image

జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. అర్జీలు పరిష్కారం కాలేదా లేదా స్థితి తెలుసుకోవాలంటే 1100కు కాల్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చన్నారు. ఈ నెల 9న అనంతపురం కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు.

News March 8, 2026

ఏప్రిల్ నెలాఖరులోగా పనులను పూర్తిచేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని 20 సబ్‌స్టేషన్లలో జరుగుతున్న పనులను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శింగనమల మండలం పెరవలిలో PM-KUSUM పథకం కింద ఏర్పాటు చేస్తున్న 4 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. రైతులు, మెఘా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు.