News February 21, 2025
అనంతపురం వైసీపీ నేతకు అంతర్జాతీయ అవార్డు

అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిట్లూరి రమేశ్ గౌడ్ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. దుబాయ్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ నుంచి అవార్డును అందుకున్నారు. సామాజిక, రాజకీయ, వ్యక్తిగత కేటగిరిలో అవార్డు దక్కినట్లు ఆయన తెలిపారు. చిట్లూరి రమేశ్ ఇటీవలే వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. ఆయనకు పలువురు వైసీపీ నేతలు అభినందనలు చెప్పారు.
Similar News
News March 21, 2025
అనంత జిల్లాలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

అనంతపురం జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నట్లు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త విజయ శంకర్ బాబు తెలిపారు. 5 రోజులలో ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. 14న 40.4°, 15న 39.8°, 16న 39.2°, 17న 40.7°, 18న 39.2°, 1940.7°, 20న 41.1° డిగ్రీలు నమోదు అయ్యాయని వివరించారు. వేసవి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News March 21, 2025
ప్రేమ విఫలం.. ధర్మవరంలో యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని ధర్మవరం పట్టణం గిర్రాజు కాలనీకి చెందిన బద్దెల ఓబునాథ్(35) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందిన వివరాల మేరకు.. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. నిరాకరించిందని మనస్తాపం చెంది గురువారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓబునాథ్ టైల్స్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 21, 2025
అనంతపురం అభివృద్ధిపై సీఎంతో చర్చ

విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును గురువారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితుల గురించి ఇరువురూ చర్చించారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ తరలింపు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరువ వంక ప్రొటెక్షన్ వాల్ గురించి సీఎంకు వివరించినట్లు ఎమ్యెల్యే తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.