News May 22, 2024
అనంతపురం: 8మంది జిల్లా బహిష్కరణ

అనంతపురం జిల్లాలో మట్కా, కర్ణాటక మద్యం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 8మందిని జిల్లా బహిష్కరణ చేస్తూ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పలుమార్లు కేసులు నమోదుచేసినా తరచూ కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో వారిపై జిల్లా బహిష్కరణ వేటు వేసినట్లు తెలిపారు. అందులో అనంతపురం, బెలుగుప్ప, గార్లదిన్నె మండలాలకు చెందిన వారు ఉన్నట్లు వెల్లడించారు.
Similar News
News September 17, 2025
ఉరవకొండలో పవర్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు

ఉరవకొండలో సెరెంటికా రెన్యూవబుల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 250 మెగావాట్ల పవర్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 50 గాలి మరలను ఏర్పాటు చేసి గ్రిడ్ అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో 320 మందికి ఉపాధి కలుగుతుంది.
News September 16, 2025
కలెక్టర్ల సమావేశానికి హాజరైన అనంత కలెక్టర్

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు మంగళవారం జరిగింది. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
News September 15, 2025
గుత్తి: 5 టన్నుల టమాటాలు పారబోశారు..!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టమాటా ధరలు రోజు రోజుకు పతనం అవుతున్నాయి. కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. గుత్తికి చెందిన రైతులు 500 బాక్సులను మార్కెట్కు తీసుకు వచ్చారు. కిలో రూ.5, రూ.3 మాత్రమే పలకడంతో ఇలా హైవే పక్కన టమాటాలను రైతులు పారబోశారు.