News August 28, 2024

అనంతపురానికి క్రికెటర్లు.. స్టేడియాన్ని పరిశీలించిన ఎస్పీ

image

అనంతపురం పట్టణ సమీపంలోని ఆర్డీటీ స్టేడియాన్ని జిల్లా ఎస్పీ జగదీశ్ అధికారులతో కలిసి సందర్శించారు. స్టేడియంలో సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ నిర్వహించాల్సిన భద్రత గురించి అధికారులు, స్టేడియం నిర్వహకులతో చర్చించారు. సుమారు 50 మందికిపైగా భారత క్రికెటర్లు నగరానికి వస్తుండటంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News October 24, 2025

జేసీ వ్యాఖ్యలను ఖండించిన అనంతపురం రేంజ్ డీఐజీ

image

తాడిపత్రి ASP రోహిత్ కుమార్ చౌదరిపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అనంతపురం రేంజ్ DIG షేమోషీ తీవ్రంగా ఖండించారు. గురువారం తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ వారికి దేశ సేవ చేయడమే ప్రధాన ధ్యేయం అన్నారు. తమకు కులం, మతం, ప్రాంతం తేడా ఉండదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని అవమానకర భాషలో సంభోదించడం పరిపాలనా ప్రమాణాలకు విరుద్ధం అన్నారు.

News October 24, 2025

కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

image

భారీ వర్షాల నేపధ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదన్నారు. ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం 8500292992కు కాల్ చేయాలన్నారు.

News October 24, 2025

పోలీసుల సేవలపై వ్యాసరచన పోటీలు: ఎస్పీ

image

పోలీసుల అమర వీరుల వారోత్సవాలు జరుగుతున్నట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసుల విధులు, సేవలు, త్యాగాల గురించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. పోలీసుల సేవలపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని ఎస్పీ తెలిపారు.