News January 22, 2025

అనంతపురానికి తారల రాక

image

అనంతపురంలో నేడు ‘డాకు మహారాజ్’ మూవీ <<15219121>>టీమ్<<>> సందడి చేయనుంది. నగరంలోని శ్రీనగర్ కాలనీ సమీపంలో సాయంత్రం జరగనున్న విజయోత్సవ వేడుకకు సినీ తారలు తరలిరానున్నారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, గ్లామర్ రోల్‌లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత నాగ వంశీ తదితరులు సందడి చేయనున్నారు. మరోవైపు పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు.

Similar News

News February 8, 2025

శైలజానాథ్‌కు కీలక పదవి ఇస్తారా?

image

పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరడంతో ఆ పార్టీ జిల్లా శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఎన్నికలకు మరో 4ఏళ్ల సమయం ఉండగా, కష్ట కాలంలో YCP తీర్థం పుచ్చుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పార్టీకి ఆయన అదనపు బలం అని భావిస్తున్నాయి. మరోవైపు శైలజానాథ్‌కు జగన్ కీలక పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

News February 8, 2025

కొడుకు ముందే ప్రాణాలు విడిచిన తల్లి

image

నార్పలకు చెందిన గంగమ్మ (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఆమె తన కొడుకు మంజునాథ్‌తో కలిసి నార్పల నుంచి హిందూపురానికి బైక్‌లో వెళ్తున్నారు. దారి మధ్యలో CK పల్లి మండలం NS గేటు సమీపంలో బైక్ గుంతలోకి దిగడంతో ఆమె ఎగిరి కింద పడ్డారు. గంగమ్మ తలకు తీవ్రగాయమై మృతి చెందింది. ఘటనకు ర్యాష్ డ్రైవింగే కారణమని స్థానికులు తెలిపారు. మృతిరాలి భర్త ఈశ్వరయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 

News February 8, 2025

అనంతపురం జిల్లా మహిళలకు గుడ్‌న్యూస్

image

అనంతపురం జిల్లాలోని మహిళలకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. ఈ నెల 28వ తేదీ నుంచి మహిళలకు కుట్టు మెషీన్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జిల్లా మహిళలకు శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ వద్ద ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

error: Content is protected !!