News January 6, 2025

అనంతపురానికి రానున్న నారా లోకేశ్

image

అనంతపురంలోని ARTS కళాశాల మైదానంలో జనవరి 9న నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాయలసీమలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News December 8, 2025

బెళుగుప్ప: బైక్‌లు ఢీకొని ఒకరి మృతి

image

బెలుగుప్ప – వెంకటాద్రి పల్లి గ్రామాల మధ్య ఆదివారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. వెంకటాద్రిపల్లికి చెందిన చంద్రమౌళి బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి (63) మృతి చెందగా, తిప్పే స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 7, 2025

అనంతపురంలో రేపు ప్రజా వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 7, 2025

మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం: ఎస్పీ

image

ఆరోగ్యవంతమైన సమాజానిర్మానానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని SP జగదీశ్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు బ్రో’ అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ యువత భవిష్యత్తును దెబ్బతీసే తీవ్రమైన సమస్య అన్నారు. ఈ ర్యాలీ వంటి కార్యక్రమాలు యువతలో అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తాయన్నారు. మత్తు పదార్థాలకు ఆరోగ్యానికి హానికరమన్నారు.