News February 24, 2025
అనంతపురానికి సరైన బెర్త్ దక్కేనా?

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉరవకొండ నుంచి 5వసారి గెలుపొంది తొలిసారి క్యాబినెట్లో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్ ఈ నెల 28న కూటమి ప్రభుత్వ తొలి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మన జిల్లా నేత బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరి పయ్యావుల పద్దులో అనంతపురం జిల్లాకు సరైన బెర్త్ దక్కేనా?
Similar News
News February 24, 2025
అనంతపురం జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

☞ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు
☞ అనంత జిల్లాలో 48,690 మంది <<15560376>>ఇంటర్ విద్యార్థులు<<>>
☞ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం- ఎంపీ
☞ అనంతపురం కలెక్టరేట్లో అర్జీలు స్వీకరించిన జేసీ
☞ రాప్తాడులో చెరువులను నీటితో నింపండి – ఎమ్మెల్యే
☞ గుత్తిలో క్రషర్ మిషన్లో పడి <<15564856>>యువకుడి మృతి<<>>
☞ అనంతపురంలో హత్య.. ఐదుగురికి <<15562592>>జీవిత ఖైదు<<>>
News February 24, 2025
ATP: PGRS కార్యక్రమంలో 502 అర్జీలు

అనంతపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పాల్గొని ప్రజల నుంచి 502 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ PGRS అర్జీలను సంబంధిత గడువులోపే పరిష్కరించాలని, ఎలాంటి పెండింగ్ ఉంచరాదని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులంతా జవాబుదారీతనంతో అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం చూపొద్దని వివరించారు.
News February 24, 2025
అనంతపురం జిల్లాలో హత్య.. ఐదుగురికి జీవిత ఖైదు

అనంతపురం జిల్లా నార్పలకు చెందిన మట్టి పవన్ కుమార్ హత్య కేసులో ఐదుగురికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ సోమవారం సంచలన తీర్పు చెప్పారు. 2022లో స్నేహితుల మధ్య విభేదాలతో దాడి జరగ్గా పవన్ మృతి చెందారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు దఫాల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో జీవిత కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.