News August 18, 2024

అనంతలో 196 హెక్టార్లలో పంట నష్టం

image

అనంతపురం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దాదాపు 196 హెక్టార్లలో పంట నష్టం జరిగి ఉంటుందని అంచనాలు వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారిని ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం మొక్కజొన్న- 89 (హెక్టార్లలో), కంది, వేరుశెనగ-22, ఉద్దులు -15, పత్తి -14, వరి-12, సోయాబిన్-8, 4 హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. ఫలితంగా సుమారు రూ.53లక్షల నష్టం అంచనా వేశామన్నారు.

Similar News

News November 3, 2025

తరచూ బాలల సంరక్షణా కేంద్రాలను తనిఖీ చేయాలి: జేసీ

image

జిల్లాలో ప్రస్తుతం ఉన్న బాలల సంరక్షణా కేంద్రాలను సంబంధిత శాఖ అధికారులు తనిఖీ చేయాలని జేసీ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి సిఫారసు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్‌పర్సన్ రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాలల సంరక్షణా కేంద్రాలలో బాలలకు సక్రమంగా పౌష్టిక ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

News November 3, 2025

435 ఆర్జీలు స్వీకరించిన జేసీ శివ్ నారాయణ్ శర్మ

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 435 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు, వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంతృప్తికర పరిష్కారం చూపించాలని జేసీ సూచించారు.

News November 3, 2025

‘అనంతపురాన్ని కరవు జిల్లాగా ప్రకటించాలి’

image

అనంతపురం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నప్ప యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం నార్పల తహశీల్దార్ కార్యాలయం ముందు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అతివృష్టి కారణంగా ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు.