News January 24, 2025
అనంత: అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

నిత్యవసర సరకుల అక్రమ నిల్వలు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో నిత్యవసర సరకులను సరఫరా చేస్తోందన్నారు. అవి లబ్ధిదారులకు మాత్రమే అందేలా చూడాలని సూచించారు. అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరగకుండా ఒక ప్రత్యేక బృందం పని చేస్తోందని తెలిపారు. నిత్యవసర వస్తువులు కేవలం పేదలకు మాత్రమే చేరాలన్నారు.
Similar News
News February 15, 2025
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ తనను కించపరిచేలా మాట్లాడారని, ఆయన అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
News February 15, 2025
యాడికి మండల లారీ డ్రైవర్ దుర్మరణం

యాడికి మండలం కుర్మాజీపేటకు చెందిన లారీ డ్రైవర్ రాజు మృతిచెందారు. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మట్టి లోడ్ చేస్తున్న సమయంలో రాజు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. లారీపై నుంచి కింద పడిన వెంటనే స్థానికులు గమనించి పిడుగురాళ్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 15, 2025
ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరూ గళమెత్తాలి: రామకృష్ణ

ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. గుంతకల్లు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన సమావేశం నిర్వహించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు పోరాడాలని సూచించారు. ఎంతో మంది పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సూచించారు.