News March 30, 2025

అనంత: ఆ గ్రామంలో ఏడేళ్ల తర్వాత ఉగాది ఉత్సవాలు.. అసలేం జరిగింది..?

image

అనంతపురం పుట్లూరు మండలం మడుగుపల్లిలో ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించేవారు. అయితే ఏడేళ్ల క్రితం గ్రామంలోని శ్రీ భైరవేశ్వరస్వామికి ఎడ్లబండ్లను కట్టి గుడి వద్దకు వెళ్తున్న సమయంలో ‘మా బండి ముందు వెళ్లాలంటే.. మా బండి ముందు వెళ్లాలి’ అంటూ పెద్దఎత్తున రాళ్లదాడులు చేసుకోవడంతో పోలీసులు ఉత్సవాలను నిలిపివేశారు. ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత తిరిగి ఉత్సవాలు జరగనుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 17, 2025

పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారంపై దృష్టి పెట్టండి: KMR SP

image

కామారెడ్డి SP రాజేష్ చంద్ర శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నాణ్యమైన దర్యాప్తుతో త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. రాత్రి సమయాల్లో అనవసరంగా తిరిగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్నారు.

News October 17, 2025

వెల్లంకిలో కలెక్టర్ ‘పల్లెనిద్ర’

image

రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామాభివృద్ధి, సమస్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ భాస్కరరావు, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు.

News October 17, 2025

సిరిసిల్ల: ‘23,387 మంది వయోజనులను గుర్తించాం’

image

ఈ సంవత్సరం జిల్లాలో 23,387 మంది వయోజనులను గుర్తించామని సిరిసిల్ల కలెక్టర్ ఎం హరిత అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరక్షరాస్య వయోజన మహిళలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించాలన్నారు. వాలంటీర్ల కోసం మార్గదర్శని పుస్తకాలను ప్రభుత్వం పంపించిందన్నారు. వికాసం పుస్తకాలు 21,894, మార్గదర్శిని పుస్తకాలు 2,190 వచ్చాయన్నారు.