News March 30, 2025
అనంత: ఆ గ్రామంలో ఏడేళ్ల తర్వాత ఉగాది ఉత్సవాలు.. అసలేం జరిగింది..?

అనంతపురం పుట్లూరు మండలం మడుగుపల్లిలో ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించేవారు. అయితే ఏడేళ్ల క్రితం గ్రామంలోని శ్రీ భైరవేశ్వరస్వామికి ఎడ్లబండ్లను కట్టి గుడి వద్దకు వెళ్తున్న సమయంలో ‘మా బండి ముందు వెళ్లాలంటే.. మా బండి ముందు వెళ్లాలి’ అంటూ పెద్దఎత్తున రాళ్లదాడులు చేసుకోవడంతో పోలీసులు ఉత్సవాలను నిలిపివేశారు. ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత తిరిగి ఉత్సవాలు జరగనుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 18, 2025
పొగ మంచు వాతావరణంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

ప్రస్తుత శీతాకాలంలో పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ములుగు ఎస్పీ శబరీశ్ అన్నారు. తెల్లవారుజామున, రాత్రివేళ సాధ్యమైనంతవరకు ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప రోడ్డు పక్కన భారీ వాహనాలు నిలప వద్దని అన్నారు. ఆ సమయంలో హాజర్ లైట్లను ఆన్ చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు.
News November 18, 2025
పొగ మంచు వాతావరణంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

ప్రస్తుత శీతాకాలంలో పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ములుగు ఎస్పీ శబరీశ్ అన్నారు. తెల్లవారుజామున, రాత్రివేళ సాధ్యమైనంతవరకు ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప రోడ్డు పక్కన భారీ వాహనాలు నిలప వద్దని అన్నారు. ఆ సమయంలో హాజర్ లైట్లను ఆన్ చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు.
News November 18, 2025
విశాఖ: బాలోత్సవం-2025 పోస్టర్ ఆవిష్కరణ

ఆనందపురంలో డిసెంబర్ 9–11వ తేదీల్లో సెయింట్ ఆంథోనీ పాఠశాలలో జరగనున్న 3వ మహా విశాఖ బాలోత్సవం-2025 పోస్టర్ను DEO ఎన్.ప్రేమకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం నిర్వాహకులు, సేవా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. గత సంవత్సరం 8,000 కంటే ఎక్కువ మంది పిల్లలు పాల్గొన్న నేపథ్యంలో ఈసారి మరింత విస్తృతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి సహకారం ప్రకటించింది.


