News March 30, 2025

అనంత: ఆ గ్రామంలో ఏడేళ్ల తర్వాత ఉగాది ఉత్సవాలు.. అసలేం జరిగింది..?

image

అనంతపురం పుట్లూరు మండలం మడుగుపల్లిలో ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించేవారు. అయితే ఏడేళ్ల క్రితం గ్రామంలోని శ్రీ భైరవేశ్వరస్వామికి ఎడ్లబండ్లను కట్టి గుడి వద్దకు వెళ్తున్న సమయంలో ‘మా బండి ముందు వెళ్లాలంటే.. మా బండి ముందు వెళ్లాలి’ అంటూ పెద్దఎత్తున రాళ్లదాడులు చేసుకోవడంతో పోలీసులు ఉత్సవాలను నిలిపివేశారు. ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత తిరిగి ఉత్సవాలు జరగనుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 20, 2025

భార్య/భర్తల్లో ఈ లక్షణాలు ఉంటే..

image

ఈ లక్షణాలుంటే మీ పార్ట్‌నర్‌కు మీ మీద ఇంట్రెస్ట్ లేనట్టేనని, జాగ్రత్త పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*ఏ విషయాన్నీ డిస్కస్ చేయకపోవడం
*పాజిటివ్ విషయాలకూ చిరాకు పడటం
*ఫ్యూచర్ గురించి పట్టించుకోకపోవడం
*ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకపోవడం
*మీతో కాకుండా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా మాట్లాడుకోవడం
*కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడానికి కూడా దగ్గరకి రాకపోవడం

News April 20, 2025

ఎన్టీఆర్: LLM పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLM(మాస్టర్ ఆఫ్ లాస్) 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.

News April 20, 2025

NRPT: వేసవి తాపం తీర్చుకునేందుకు.. శీతల పానీయాలు

image

నారాయణపేట జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలువ చేసే ద్రవపదార్థాలను తీసుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక చెరకు రసం, మజ్జిగ, లస్సీ, జ్యూస్, కొబ్బరి బోండాలు తాగేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ వేసవిలో వీటికి గిరాకీ ఉంది. ఈ కాలంలో లభించే కీరా, తాటి ముంజలు, కళింగ పండ్లకు డిమాండ్ ఉంది.

error: Content is protected !!