News July 21, 2024

అనంత: ఇద్దరు చిన్నారులు దుర్మరణం

image

బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని చిన్నారులు మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల వివరాలు..<<13666450>>గుమ్మగట్ట<<>>(M) ఎస్.హొసళ్లి‌కి చెందిన మల్లికార్జున కుమారుడు అరుణతేజ, మల్లేశ్ కుమార్తే స్పందన.. వీరిద్దరూ అన్నదమ్ములు. చిన్నారులను రాయదుర్గం పాఠశాలకు మామ సురేశ్ బైక్‌పై తీసుకెళుతుండగా వేగంగా వచ్చి ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అరుణతేజ అక్కడికక్కడే మృతిచెందగా, స్పందన ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.

Similar News

News December 17, 2025

అనంత: సూరీడు సమయం మారిపోతోంది.!

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ప్రభావంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. దానికి తోడు ఉదయం 8.30 గంటలవుతున్నప్పటికీ పొగ మంచు కప్పి వేయడంతో సూర్య భగవానుడు సైతం కనిపించని పరిస్థితి నెలకొంటుంది. వాహనదారులు పొగ మంచు పూర్తిగా క్లియర్ అయిన తర్వాత ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో సూర్యోదయం దృశ్యాలను చూడొచ్చు.

News December 17, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం

image

బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి ZP హైస్కూల్ PET జగన్మోహన్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, డిస్కస్ త్రో, 4×100 మీ. రిలే.. ఇలా పాల్గొన్న 4 విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించారు. ఈ ఘనతతో రాజస్థాన్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఆయన ఎంపికయ్యారు. ఆయనను ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు.

News December 17, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం

image

బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి ZP హైస్కూల్ PET జగన్మోహన్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, డిస్కస్ త్రో, 4×100 మీ. రిలే.. ఇలా పాల్గొన్న 4 విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించారు. ఈ ఘనతతో రాజస్థాన్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఆయన ఎంపికయ్యారు. ఆయనను ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు.