News February 26, 2026
అనంత: ‘ఏ తల్లి కన్న బిడ్డో.. ఇంకా జాడ లేదు’

బొమ్మనహాల్ మండలం నేమకల్లులో గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లిన ఘటనలో ఆ బిడ్డ ఎవరనే విషయం 24 గంటలైనా తేలలేదు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి మదర్ మిల్క్ న్యూట్రీషన్ సెంటర్లో వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఉన్నతాధికారులు ఎవరూ అక్కడికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న దాఖలాలు లేవు. ICDS, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదని తెలుస్తోంది.
Similar News
News April 18, 2026
KNR: నేడు ఎలగందల్ కోటలో ఉచిత ప్రవేశం

కరీంనగర్ జిల్లాలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఎలగందల్ కోటను సందర్శించాలని భావిస్తున్న వారికి అధికారులు శుభవార్త తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నేడు కోటను సందర్శించే వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. ఈ ప్రత్యేక అవకాశాన్ని ఉపయోగించుకొని కోటను సందర్శించుకోవాలని పర్యాటకులకు అధికారులు సూచించారు. ఎలగందల్ కోట తన వైభవమైన చరిత్ర, అద్భుత నిర్మాణ శైలితో ప్రసిద్ధి చెందింది.
News April 18, 2026
GNT: ముందస్తు పన్ను చెల్లింపులకు విశేష స్పందన!

ఈ నెలాఖరులోగా ముందస్తు ఆస్తిపన్ను కడితే 5% రాయితీ ఇస్తుండటంతో మంచి స్పందన వస్తోంది. అధికారులు ముమ్మర ప్రచారం చేస్తుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. కేవలం 9 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ. 41.10 కోట్ల పన్ను వసూలైంది. ఇందులో గుంటూరులో రూ. 32.29 కోట్లు, పల్నాడులో రూ. 5.52 కోట్లు, బాపట్లలో రూ. 2.51 కోట్లు జమ అయ్యాయి. ఈ నెలాఖరుకు వసూళ్లు మరింత పెరగనున్నాయి.
News April 18, 2026
శాతవాహన వర్సిటీలో ‘ఈసీ’ లొల్లి.. వీసీ తీరుపై నిరసన జ్వాలలు

శాతవాహన విశ్వవిద్యాలయం ఈసీ సభ్యుల నామినేషన్పై వివాదం నెలకొంది. వీసీ ప్రొ.ఉమేష్ కుమార్ నిబంధనలు ఉల్లంఘించి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి సూచనల మేరకే సభ్యులను ఎంపిక చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ ప్రొఫెసర్లను పక్కనబెట్టి, వీసీ, మంత్రికి అత్యంత ఇష్టమైన వ్యక్తులను నామినేట్ చేశారని విద్యార్థులు మండిపడుతున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై నియామకాలు జరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


