News September 12, 2024

అనంత: కార్మికుల పోరాటం.. స్పందించిన పవన్ కళ్యాణ్

image

ఉమ్మడి అనంత జిల్లాలో సత్యసాయి తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న 536 మంది కార్మికులకు ఫిబ్రవరి నుంచి వేతనాలు నిలిచిపోయాయి. దీంతో 21 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు. స్పందించిన డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. వేతనాల కోసం రూ.30 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు.

Similar News

News December 9, 2025

వాహనదారులారా.. రూల్స్ అతిక్రమించకండి: ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ అధికారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. వాహనదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వేగం, ప్రమాదకర డ్రైవింగ్, మద్యం మత్తు, నిద్రమత్తు డ్రైవింగ్‌ను పూర్తిగా నివారించాలన్నారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, రోడ్డు సంకేతాలను వాహనదారులు కచ్చితంగా పాటించాలన్నారు. బండి పత్రాలు ఉండాలని, హెల్మెట్/సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడలని, లేనిచో చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు.

News December 9, 2025

అనంత జిల్లాలో యువకుడి దారుణ హత్య

image

అనంతపురం(D) బుక్కరాయ సముద్రం పంచాయతీ పరిధిలోని వీరభద్ర కాలనీకి చెందిన సాయిచరణ్(23) దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయి చరణ్ స్నేహితులే పొలంలో కొట్టి చంపి, అనంతరం బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌‌లో విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News December 9, 2025

అనంత: పోలీసుల PGRSకు 128 పిటిషన్లు.!

image

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన PGRSకు ప్రజల నుంచి 128 పిటిషన్లు వచ్చినట్లు జిల్లా SP జగదీశ్ తెలిపారు. ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరానికి సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులు పంపించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.