News February 9, 2025
అనంత: చొక్కాపై పేర్లు రాసుకుని వ్యక్తి సూసైడ్

ఉరవకొండలోని చంగల వీధికి చెందిన కిశోర్(33) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు కొందరు వ్యక్తులు కారణం అంటూ వారి పేర్లను చొక్కాపై రాసుకున్నాడు.ఇంట్లో ఉరివేసుకున్న విషయం గమనించిన కుటుంబ సభ్యులు కిశోర్ను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 5, 2025
IndiGoకే సమస్య ఎందుకు.. ఏం జరుగుతోంది?

దేశంలో IndiGo తప్ప మిగతా ఎయిర్లైన్స్ సర్వీసులు మామూలుగానే నడుస్తున్నాయి. ఇండిగోకే ఎందుకు సమస్య వచ్చింది? నిజానికి పైలట్లకు వారానికి అదనంగా 12గంటల రెస్ట్ ఇవ్వాలని DGCA ఇటీవల రూల్ తెచ్చింది. అదనపు పైలట్ల నియామకానికి 18నెలల గడువిచ్చింది. ఎయిరిండియా, ఆకాశ, విస్తారా ఈ మేరకు సర్దుబాటు చేసుకోగా, ఇండిగో మాత్రం పట్టించుకోలేదు. 60% మార్కెట్ ఉన్న సంస్థ సిబ్బందిని ఎందుకు నియమించలేదనేది చర్చనీయాంశమవుతోంది.
News December 5, 2025
నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం

ప్రపంచ జనాభాకు అందే ఆహారంలో 95శాతం నేల నుంచే అందుతోంది. అందుకే మనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం. నేల ఆరోగ్యంగా, సారవంతంగా ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుంది. అందుకే భూమి ప్రాధాన్యత, సంరక్షణకు తీసుకోవాల్సి జాగ్రత్తలను వివరించడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ & అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఓ తీర్మానం చేసింది. 2014 DEC-5 నుంచి ఏటా ఈ రోజున ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలి: వద్దిరెడ్డిగూడెం వాసులు

నల్గొండ జిల్లా గుర్రంపోడు గ్రామ పంచాయతీ ఆవాస ప్రాంతాలైన వద్దిరెడ్డిగూడెం, శాంతినగర్ను కలిపి ప్రత్యేక పంచాయతీ చేసే వరకు ఎన్నికలు నిలిపివేయాలని వద్దిరెడ్డిగూడెం గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గుర్రంపోడు పంచాయతీలో మొత్తం 2,700 మంది ఓటర్లు ఉండగా వద్దిరెడ్డిగూడెం, శాంతినగర్లో 340 ఓట్లు ఉన్నాయని, గుర్రంపోడు వారే సర్పంచ్, ఉప సర్పంచ్గా ఉంటున్నారని, దీంతో తమ గ్రామాలు అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు.


